Gold Rate: డబ్బున్నోళ్లకీ ప్రియమైన పసిడి.. తులం రేటు హైదరాబాదీలకు షాకిస్తోంది!

Gold Rate: డబ్బున్నోళ్లకీ ప్రియమైన పసిడి.. తులం రేటు హైదరాబాదీలకు షాకిస్తోంది!

Gold Price Today: ఈవారం ప్రారంభంలో వరుసగా తగ్గిన పసిడి ధర గడిచిన రెండురోజుల్లోనే తిరిగి పెరగటం ఆందోళనలు కలిగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలతో సామాన్యులు సైతం బంగారానికి బదులు గిల్టు నగలు కొనుక్కుని సరిపెట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. మరో పక్క వెండి కూడా తగ్గేదేలే అన్నట్లుగా తన పెరుగుదలను కొనసాగిస్తూనే ఉంది. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.8వేలు భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 100, ముంబైలో రూ.9వేల 100, దిల్లీలో రూ.9వేల 115, కలకత్తాలో రూ.9వేల 100, బెంగళూరులో రూ.9వేల 100, కేరళలో రూ.9వేల 100, పూణేలో రూ.9వేల 100, వడోదరలో రూ.9వేల 105, జైపూరులో రూ.9వేల 115, లక్నోలో రూ.9వేల 115, మంగళూరులో రూ.9వేల 100, అయోధ్యలో రూ.9వేల 115, నాశిక్ లో రూ.9వేల 103, బళ్లారిలో రూ.9వేల 100, నోయిడాలో రూ.9వేల 115, గురుగ్రాములో రూ.9వేల 115 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8వేల 800 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 928, ముంబైలో రూ.9వేల 928, దిల్లీలో రూ.9వేల 943, కలకత్తాలో రూ.9వేల 928, బెంగళూరులో రూ.9వేల 928, కేరళలో రూ.9వేల 928, పూణేలో రూ.9వేల 928, వడోదరలో రూ.9వేల 933, జైపూరులో రూ.9వేల 943, లక్నోలో రూ.9వేల 943, మంగళూరులో రూ.9వేల 928, అయోధ్యలో రూ.9వేల 943, నాశిక్ లో రూ.9వేల 931, బళ్లారిలో రూ.9వేల 928, నోయిడాలో రూ.9వేల 943, గురుగ్రాములో రూ.9వేల 943గా ఉన్నాయి.  

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 000 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 280గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 18వేల 900 వద్ద ఉంది.