గాంధీనగర్​లో కిలో బంగారం సీజ్

గాంధీనగర్​లో  కిలో బంగారం సీజ్

ముషీరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా హైదరాబాద్​లోని గాంధీ నగర్ పోలీసులు బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కియా కారు నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దోమలగూడ పోలీస్ స్టేషన్​లో అధికారులు కేసు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ భైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్ కిలో బంగారంతో వెహికల్​లో ప్రయాణించాడని తెలిపారు. 

అతను అదిలాబాద్ కు వెళ్తుండగా తనిఖీల్లో  పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సరైన పత్రాలు బిల్లు చూపిస్తే గోల్డ్  వారికే తిరిగి అందజేస్తామని..లేకుంటే ఇన్ కమ్ టాక్స్ అధికారులకు అప్పగిస్తామని డీసీపీ స్పష్టం చేశారు.