హైదరాబాద్, వెలుగు: గోల్డ్ సిక్కా కంపెనీ హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో మొదటి గోల్డ్ ఎటీఎంను శుక్రవారం ప్రారంభించింది. ఇందులో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఉంటాయి. ఈ ఏటీఎం ద్వారా గోల్డ్ 10- సిల్వర్ కాయిన్లను వారి డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ ,యూపీఐ ద్వారా కానీ కొనుగోలు చేయవచ్చు. తమ ప్రొడక్టులకు చాలా డిమాండ్ ఉందని, దేశవిదేశాల్లోని త్వరలోనే 3000 వరకు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని గోల్డ్సిక్కా తెలిపింది.