చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. షార్జా నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఐదుగురు ప్రయాణికుల నుంచి రూ.82.3లక్షల విలువైన 1.48 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన ఖాజా మొహియుద్దీన్, ఎస్ పీర్ మొహియుద్దీన్లతో పాటు ఐదుగురి నుంచి 1.2 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం ప్యాకెట్లను చెప్పుల్లో పెట్టుకొని షార్జా నుంచి వచ్చారు. ఐదుగురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
see more news