హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫీజుపై 25 శాతం రాయితీతో పాటు మే 1 నుంచి మరో మూడు నెలల పాటు గడువు పొడిగించినట్లు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పెండింగ్లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సోమవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు.
ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ను ఆదేశించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నగర వ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ప్రత్యేక హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించేలా ప్రత్యేక డ్రైవ్లు, ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహించాలన్నారు.
