- యాదవ – కురుమ సంఘాల రాజ్యాధికార ఐక్యవేదిక
ఖైరతాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం గొల్ల, కురుమలకు రాజ్యాధికార పదవులు ఇవ్వాలని యాదవ-– కురుమ సంఘాల రాజ్యాధికార ఐక్యవేదిక డిమాండ్చేసింది. వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ‘మేమెంతో.. మాకు అంత’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక చైర్మన్మేకల కృష్ణ, ప్రొఫెస్ర్లు సింహాద్రి యాదవ్, రాములు యాదవ్, బీఆర్ఎస్లీడర్క్యామ మల్లేశ్, బీజేపీ లీడర్కాశం వెంకటేశ్వర్లు, మేకల రాములు యాదవ్పాల్గొని మాట్లాడారు.
జనాభా ప్రకారం యాదవ, కురుమ సామాజిక వర్గాలకు 3 మంత్రి పదవులు, 6 ఎమ్మెల్సీ, 2 ఎంపీ సీట్లు,13 కార్పొరేషన్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం గొల్ల, కురుమలపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. 14 శాతంగా ఉన్నవారికి పదవుల్లో అన్యాయం చేస్తోందన్నారు. మంత్రి వర్గంలో యాదవులకు చోటు లేదని, ప్రభుత్వంలోని పదవులన్నీ రెండు సామాజిక వర్గాలకే కట్టబెడుతున్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెప్పారు.