గొర్లతో రోడ్డుపై బైఠాయించిన గొల్లకుర్మలు

గొర్లతో రోడ్డుపై బైఠాయించిన గొల్లకుర్మలు

తొగుట, వెలుగు: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ గురువారం మెదక్​ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో  గొల్లకుర్మలు గొర్లను రోడ్డుపైకి తోలి  బైఠాయించారు. దీంతో గంటసేపు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

ఈ సందర్భంగా గొల్లకుర్మ లీడర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు వెంటనే గొర్లను ఇవ్వాలన్నారు. చట్టసభల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని, 50 ఏండ్లు నిండిన గొర్ల కాపరులకు రూ.2 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.