ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. 2020-21 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సిలబస్ లో 30 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇదే విషయంపై గురువారం రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. కరోనా క్రమంలో ఆన్ లైన్ క్లాసులు ఆలస్యంగా మొదలుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. CBSE ఏ సిలబస్ అయితే తగ్గించిందో తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా అదే సిలబస్ తగ్గిస్తామని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాయని వారిని కూడా పాస్ చేస్తామని తెలిపారు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్. దీంతో ఇంటర్ స్టూడెంట్స్ కు కరోనా పుణ్యమా అని డబుల్ ధమాకా వచ్చినట్లయ్యింది.