గూగుల్​కు రూ. 1,434 కోట్ల ఫైన్​

గూగుల్​కు రూ. 1,434 కోట్ల ఫైన్​

వాషింగ్టన్​: పిల్లల ప్రైవసీ రూల్స్​ను ఉల్లంఘించినందుకు గూగుల్​ భారీ జరిమానాను చెల్లించబోతున్నట్టు తెలుస్తోంది. చిల్డ్రెన్స్​ ప్రైవసీ రూల్స్​కు విరుద్ధంగా ప్రకటనలు మరిన్ని రావాలన్న లక్ష్యంతో వారి డేటాను గూగుల్​ అనుబంధ సంస్థ యూట్యూబ్​ సేకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమెరికా ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​ (ఎఫ్​టీసీ)తో గూగుల్​ సెటిల్మెంట్​ కుదుర్చుకుందని న్యూయార్క్​ టైమ్స్​ పేర్కొంది. సుమారు ₹1,076 కోట్లు (15 కోట్ల డాలర్లు) నుంచి ₹1434.8 కోట్లు (20 కోట్ల డాలర్లు) దాకా చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ సెటిల్మెంట్​ గురించి ఎఫ్​టీసీ ప్రకటన చేసే అవకాశముంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండానే 13 ఏళ్ల లోపు పిల్లల డేటాను సేకరించి ప్రైవసీ చట్టాలను యూట్యూబ్​ ఉల్లంఘించిందని కొన్ని ప్రైవసీ గ్రూప్​లు ఆరోపించాయి.