 
                                    - 18 నెలల పాటు వాడుకోవచ్చు
- దీని విలువ రూ.35,100
హైదరాబాద్, వెలుగు: గూగుల్, రిలయన్స్ సంస్థలు భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకాన్ని పెంచేందుకు చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా, రూ.35,100 విలువ గల గూగుల్  జెమిని 2.5 ప్రో ప్లాన్ను అర్హులైన జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా అందించనున్నాయి. దీని ద్వారా యూజర్లకు జెమిని యాప్లో 2టీబీ క్లౌడ్స్టోరేజీ, నానో బనానా, వియో 3.1 మోడల్స్తో చిత్రాలు, వీడియోలు రూపొందించడం వంటి సదుపాయాలు ఉంటాయి.
మొదటగా 18–-25 ఏళ్ల జియో 5జీ యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. వ్యాపార సంస్థల కోసం, రిలయన్స్ ఇంటెలిజెన్స్కు గూగుల్ క్లౌడ్ గో -టు- మార్కెట్ భాగస్వామిగా వ్యవహరిస్తూ, జెమిని ఎంటర్ప్రైజ్ను భారత్కు తీసుకురానుంది. రిలయన్స్ సంస్థ గూగుల్ క్లౌడ్కు చెందిన టీపీయూలను కూడా వినియోగించుకోనుంది.

 
         
                     
                     
                    