
Google Phones: ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ అయిన భారతదేశంలో గూగుల్ తన ఫోన్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రిటైల్ అమ్మకాలను విస్తరించటానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
మే 29 ప్రకటన ప్రకారం ఇకపై స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు తమకు నచ్చిన గూగుల్ పిక్సెల్ ఫోన్లను నేరుగా ఆన్ లైన్ అధికారిక గూగుల్ స్టోర్ నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం నేరుగా కస్టమర్లకు ఈకామర్స్ ద్వారా విక్రయించే బూమ్ కొనసాగుతున్న క్రమంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
కంపెనీ ప్రజల డిమాండ్ కి అనుగుణంగా సేవలను అందించటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు గూగుల్ ఇండియా డీవైజెస్ అండ్ సర్వీసెస్ ఎండీ మితుల్ షా వెల్లడించారు. దీంతో ఫిక్సెల్ 9, పిక్సెల్ 9ఏ, పిక్సెల్ ప్రో ఫోల్డ్, పిక్సెల్ వాచీలు, పిక్సెల్ బడ్స్ వంటి అన్ని ఉత్పత్తులు నేరుగా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
గూగుల్ గతంలో పిక్సెల్ ఫోన్స్ ఎలా అమ్మేది?
ప్రస్తుతం నేరుగా కస్టమర్లకు తన ఉత్పత్తులను నెట్టింట అమ్మాలనుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించగా.. దానికి ముందు మాత్రం థర్డ్ పార్టీ రిటైలర్లైన క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించింది. దీనికోసం కంపెనీ భారీగానే వెచ్చించినట్లు తెలుస్తోంది. అమెరికా తర్వాత ఇలా నేరుగా కస్టమర్లకు విక్రయించే ఆప్షన్ కేవలం భారతదేశంలోనే గూగుల్ ప్రారంభించింది.
కస్టమర్లు తమకు నచ్చిన గూగుల్ స్మార్ట్ ఫోన్లు, ఉత్పత్తులను యూపీఐ, కార్డ్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందిస్తోంది. దాదాపు ఇందుకోసం 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పాత డివైజ్ ఎక్స్ఛేంజ్ కింద అందించటానికి షాపిఫైతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టర్ చేసిన వస్తువులను బ్లూడార్ట్ కొరియర్ ద్వారా దేశం నలుమూలలకు డెలివరీకి సిద్ధమైంది. ఇప్పటికే ఆపిల్ సంస్థ దేశంలో తన రిటైల్ స్టోర్లను ఆపరేట్ చేస్తుండగా.. గూగుల్ కూడా ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పిక్సెల్ ఉత్పత్తులు అనేక బ్రాండెడ్ రిటైల్ స్టోర్లలో కూడా విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.