గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభమైంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. ముహూర్తం షాట్కు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ కెమెరా స్విచాన్ చేయగా, శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు రమేష్ ప్రసాద్, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. చాలా భాగం ఫారిన్ లొకేషన్స్లో షూటిం గ్ చేయబోతున్నాం’ అని చెప్పారు. గోపీచంద్ నటిస్తున్న 32వ సినిమా ఇది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. శ్రీనువైట్ల కాంబినేషన్లో పలు బ్లాక్బస్టర్స్ చిత్రాలకి పని చేసిన గోపీ మోహన్ దీనికి స్క్రీన్ప్లే రాస్తున్నారు. కె.వి.గుహన్ కెమెరామెన్. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.