కామారెడ్డిని మరింత డెవలప్​మెంట్​ చేస్తాం : షబ్బీర్​అలీ

కామారెడ్డిని మరింత డెవలప్​మెంట్​ చేస్తాం : షబ్బీర్​అలీ
  •     ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
  •     కామారెడ్డి మున్సిపల్​ ఛైర్​పర్సన్​ గా ఇందుప్రియ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డిటౌన్​, వెలుగు:  కామారెడ్డి పట్టణాన్ని మరింత డెవలప్​మెంట్​ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ అన్నారు.  శుక్రవారం కామారెడ్డి మున్సిపల్​ చైర్ పర్సన్​ గడ్డం ఇందుప్రియ బాధ్యతలు చేపట్టారు.  ఈ ప్రొగ్రాంకు  షబ్బీర్​అలీ హాజరై చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ను అభినందించారు.  ఆయన మాట్లాడుతూ..  మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఎనిమిది నెలల్లో బెస్ట్​ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ ఎలక్షన్​ తర్వాత  సీఎం సమక్షంలో మున్సిపల్​ ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో  మీటింగ్​ ఏర్పాటు చేయిస్తానన్నారు.  ఇందిరాగాంధీ స్టేడియంను మరింతగా అధునీకరిస్తామని, టౌన్‌‌‌‌‌‌‌‌ లో  ట్రాఫిక్​ సమస్యను పరిష్కరిస్తామన్నారు.