కొంత సమయం ఇవ్వాలని హైకోర్టును కోరిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై సర్కార్ నిర్ణయాన్ని చెప్పేందుకు 3 వారాల టైమ్కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. గురువారం ఏజీ బీఎస్ ప్రసాద్ చేసిన వినతిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ల డివిజన్ బెంచ్ అనుమతించింది. 220 సర్పంచ్ పదవులు, 94 ఎంపీటీసీ స్థానాలు, 4 జడ్పీటీసీ, 5,364 వార్డులు, 344 ఉప సర్పంచ్ పదవులు ఖాళీగా ఉన్నాయంటూ లాయర్ భాస్కర్ పిల్ వేశారు. విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.