లోకల్​బాడీ ఎలక్షన్లపై మూడు వారాల్లో తేలుస్తం: రాష్ట్ర ప్రభుత్వం

లోకల్​బాడీ ఎలక్షన్లపై మూడు వారాల్లో తేలుస్తం: రాష్ట్ర ప్రభుత్వం

కొంత సమయం ఇవ్వాలని హైకోర్టును కోరిన ప్రభుత్వం


హైదరాబాద్, వెలుగు: ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై సర్కార్​ నిర్ణయాన్ని చెప్పేందుకు 3 వారాల టైమ్​కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. గురువారం ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చేసిన వినతిని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ వినోద్‌‌ కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ అనుమతించింది. 220 సర్పంచ్‌‌ పదవులు, 94 ఎంపీటీసీ స్థానాలు, 4 జడ్పీటీసీ, 5,364 వార్డులు, 344 ఉప సర్పంచ్‌‌ పదవులు ఖాళీగా ఉన్నాయంటూ లాయర్‌‌ భాస్కర్‌‌ పిల్ వేశారు. విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.