అందుబాటులోకి నిర్మల్ జిల్లాలో సర్కారు మెడికల్ కాలేజీ !

అందుబాటులోకి నిర్మల్ జిల్లాలో సర్కారు మెడికల్ కాలేజీ !

హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లాలో సర్కారు మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఇప్పటికే పరిపాలన అనుమతులు పొందిన  జారీ చేసిన రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌‌‌‌, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్‌‌‌‌, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌, జనగాం జిల్లాలతో పాటు నిర్మల్  మెడికల్ కాలేజీ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌‌‌‌కు రాష్ట్ర అధికారులు దరఖాస్తులు పం పించారు.

ఈ 9 కాలేజీల్లో ఒక్కో దానికి వంద సీట్ల చొప్పున కేటాయించాలని ఎన్‌‌‌‌ఎంసీకి  డీఎంఈ రమేశ్‌‌‌‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతమున్న జిల్లా కేంద్ర దవాఖానలనే మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖానగా అభివృద్ధి చేస్తామని అప్లికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర సర్కార్ నిధులు కేటాయించిందని తెలిపారు.