న్యూఢిల్లీ: పాన్.. ఆధార్ లింక్ ఆలస్యం చేసిన వారి నుంచి లేట్ పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.600 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే 11.48 కోట్ల పాన్లు ఇంకా ఆధార్తో లింక్ కాలేదని తెలిపింది. సోమవారం లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
2024 జనవరి 29 నాటికి అందుబాటులో ఉన్న లెక్కలు ఇవని తెలిపారు. పాన్, ఆధార్ ఫ్రీ లింక్కు 2023 జూన్ 30 చివరి తేదీ. ఆ తర్వాత నుంచి పాన్, ఆధార్ను లింక్ చేసుకోవాలంటే ప్రభుత్వం రూ. వెయ్యి పెనాల్టీ విధిస్తోంది.