
హైదరాబాద్, వెలుగు: సింగరేణికి కేటాయించిన ఒడిశాలోని నైనీ బ్లాక్కు ఆ ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేసింది. సింగరేణికి 2015లో ఒడిశాలోని అంగూల్ జిల్లాలోగల నైనీ బొగ్గు బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు సింగరేణి ప్రణాళికలు చేసుకున్నది. అయితే, వివిధ కారణాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తి సాధ్యంకాలేదు. 2022 స్టేజ్ 2 అనుమతులు రాకుండా డిలే అయింది. తాజాగా, 643 ఎకరాల అటవీ భూములు ఇవ్వడానికి ఒడిశా ప్రభుత్వం నైనీబ్లాక్కు ఫారెస్ట్ క్లియెరెన్స్ఇచ్చింది. అటవీ అనుమతుల నిర్ణయంతో సింగరేణికి బొగ్గు ఉత్పత్తికి అడ్డంకులు అన్నీ తొలగిపోయి మార్గం సుగమమైంది.
ఒడిశా సీఎంకు కిషన్రెడ్డి కృతజ్ఞతలు
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2015లోనే సింగరేణికి ఈ నైనీ బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యం కాలేదని పేర్కొన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాక తెలంగాణలో పవర్ సెక్యూరిటీకి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. అనుమతుల కోసం వేగవంతంగా నిర్ణయం తీసుకున్నారని ఒడిశా సీఎం మోహన్ చరణ్మాంఝీకి కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.