హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు ఇక నుంచి 4,016 పెన్షన్ ను అందుకోనున్నారు. ఈ నెల నుంచి పెన్షన్ పెంపు అమలులోకి వస్తుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
దీని ప్రకారం 5 లక్షల పైగా దివ్యాంగ పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. పెన్షన్ పెంపునకు సంబంధించిన జీవోను ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. పెంచిన పెన్షన్ ప్రకారం 5,11,656 మంది దివ్యాంగులకు రూ.4,016 చొప్పున నెలకు రూ.205.48 కోట్లు అందుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.