వచ్చే నెలలో ఎల్ఐసీ ఐపీఓ.. టార్గెట్ ​50 వేల కోట్లు

వచ్చే నెలలో ఎల్ఐసీ ఐపీఓ.. టార్గెట్ ​50 వేల కోట్లు
  • దేశంలోనే అతి పెద్ద ఐపీఓ
  • ఆసక్తితో ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు

న్యూఢిల్లీ: ఎల్​ఐసీ (లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా) ఐపీఓ వచ్చే నెలలో ఉంటుందని బ్లూమ్​బర్గ్​ న్యూస్​తెలిపింది. ఎల్​ఐసీలో 7 శాతం వాటా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎల్​ఐసీ ఐపీఓ ద్వారా రూ. 50 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకున్నట్లు బ్లూమ్​బర్గ్​ మంగళవారం పేర్కొంది. దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా ఎల్​ఐసీ ఐపీఓ హిస్టరీ సృష్టించనుంది. లిస్టయిన తర్వాత వాల్యుయేషన్​ పరంగా దేశంలోని టాప్​ కంపెనీలయిన రిలయన్స్​, టీసీఎస్​ల సరసన ఎల్​ఐసీ చేరుతుంది. మన దేశంలో ఇప్పటిదాకా అతి పెద్ద ఐపీఓగా పేటీఎం నిలుస్తోంది. ఈ కంపెనీ 2021లో  రూ.18,300 కోట్లకు ఐపీఓకి వచ్చింది. ఆ తర్వాత  రూ.15,500 కోట్ల ఐపీఓతో  కోల్​ ఇండియా  రెండో ప్లేస్​లోనూ, రూ.11,700 కోట్ల ఐపీఓతో రిలయన్స్​ పవర్​ మూడో ప్లేస్​లోనూ నిలుస్తున్నాయి. రిలయన్స్​ పవర్​ ఐపీఓ 2008లోనూ, కోల్​ ఇండియా ఐపీఓ 2010లోనూ జరిగాయి.

మే 12 దాకా టైము..

డ్రాఫ్ట్​ ప్రాస్పెక్టస్​ ప్రకారం 31.6 కోట్ల షేర్ల అమ్మకం ద్వారా  రూ. 60 వేల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ ప్లాన్​. మే 12 దాకా ఎల్​ఐసీ ఐపీఓ తేవడానికి గడువుంది. ఆలోపు పూర్తయితే సెబీ వద్ద మరోసారి పేపర్లు ఫైల్​ చేయక్కర్లేదు. సెబీ అనుమతి గడువు ముగిసేలోపే ఐపీఓను తేవాలని ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. ఎంబెడ్డెడ్​ వాల్యూతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు వాల్యుయేషన్​ను ఎల్​ఐసీ కోరుకుంటోంది. ఐపీఓ ఆఫరింగ్​ ఎలా ఉండాలనే దానిపై సీనియర్​ ఆఫీసర్లు ఇంకా డిస్కస్​ చేస్తున్నారు. ఎంత మొత్తం సమీకరించాలనేది కూడా మారే ఛాన్స్​ ఉంది. బడ్జెట్​ లోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలలోని వాటాలను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకుంది.  సెబీ వద్ద తాజాగా ఎల్​ఐసీ పేపర్లను ఫైల్​ చేశారు. ఇందులో డిసెంబర్​ క్వార్టర్​ రిజల్ట్స్​ను కూడా చేర్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎల్​ఐసీ ఐపీఓ పేపర్లను సెబీ వద్ద ఫైల్​ చేశారు. అప్పట్లో సెప్టెంబర్​ దాకా ఫైనాన్షియల్​ రిజల్ట్స్​ను ఇచ్చారు. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో ఓలటాలిటీ పెరగడంతో ఐపీఓను వాయిదా వేశారు. ఎల్​ఐసీ ఐపీఓ కోసం చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని డిజిన్వెస్ట్​మెంట్​ సెక్రటరీ తుహిన్​ కాంత పాండే చెప్పారు. సక్సెస్​ఫుల్​గా పూర్తవుతుందనే నమ్మకం కుదిరినప్పుడే ఐపీఓ చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్​30, 2021 నాటికి ఎల్​ఐసీ ఎంబెడ్డెడ్​ వాల్యూను రూ. 5.4 లక్ష కోట్లుగా లెక్కించారు. ఇంటర్నేషనల్​ యాక్ట్యుయేరియల్​ సంస్థ మిల్లిమాన్​ అడ్వైజర్స్​ ఈ వాల్యూ  లెక్క కట్టింది. ఎల్​ఐసీ  మార్కెట్​ వాల్యుయేషన్​ఎంతనేది డ్రాఫ్ట్​ ప్రాస్పెక్టస్​ చెప్పనప్పటికీ, ఇండస్ట్రీ స్టాండర్డ్స్​ ప్రకారం చూస్తే ఇది ఎంబెడ్డెడ్​ వాల్యూకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. 

మూడో క్వార్టర్​ లాభం రూ. 235 కోట్లు..

ఎల్​ఐసీ నికర లాభం మూడో క్వార్టర్లో రూ. 235 కోట్లు పెరిగింది. అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్లో ఇది రూ. 94 లక్షలు. డిసెంబర్​2021తో ముగిసిన 9 నెలల కాలానికి చూస్తే  లాభం రూ. 1,643 కోట్లు. అంతకు ముందు ఏడాది 9 నెలలకూ ఇది రూ. 7 కోట్లు మాత్రమే.