
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగ విలువలను కాపాడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను నిర్వర్తించాలని సూచిం చారు. నల్సార్ యూనివర్సిటీలో రెండు రోజులుగా టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరు గుతున్న నేషనల్ వర్క్ షాప్ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా చీఫ్ గెస్టుగా హాజరైన జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. నీతి, న్యాయం, సామర్థ్యంతో నియామ క ప్రక్రియలు జరగాలన్నారు.
రెండో రోజు చట్టపరమైన పనులలో సాంకేతిక తను ఏకీకృతం చేయడం, ఆల్, బ్లాక్ చైన్ ద్వారా సామర్థ్యాన్ని పెంపొందిం చడం, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి యంత్రాంగాలను ఏర్పాటు చేయడంపై చర్చించారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, కర్నాటక పీఎస్సీ చైర్మన్ శివ శంకరప్ప ఎస్.సహూకర్, యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ సంతోష్ గోపాల్ అజ్మీరా, గోవా పీఎస్సీ చైర్మన్ ఉదయ్ సిన్హ్ ఎస్. రావురానే, గుజరాత్ పీఎస్సీ చైర్మన్ హస్ముఖ్ పటేల్ పాల్గొన్నారు.