రాజ్భవన్ లో ఘనంగా దీపావళి సంబరాలు

రాజ్భవన్ లో ఘనంగా  దీపావళి సంబరాలు

దీపావళి పండుగ సందర్భంగా రాజ్ భవన్ దర్బార్ హాల్ లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు జనం, పలువురు ప్రముఖులు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. వ్యాక్సినేషన్ వల్ల జనం నిర్భయంగా ఒకరినొకరు కలుసుకోగలుగుతున్నారన్నారు. 

 రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై తమిళిసై .. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచిక ఈ పండుగ అని తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సు మరింతగా రావాలని ఈ శుభ సందర్భంగా గవర్నర్‌ ప్రార్థించారు.