2024 నాటికి టీబీ నిర్మూలన జరగాలి : గవర్నర్

2024 నాటికి టీబీ నిర్మూలన జరగాలి : గవర్నర్

కరోనా సమయంలో ప్రజారోగ్య పరిరక్షణకు రెడ్ క్రాస్ సభ్యులు చేసిన కృషిని మరువలేమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇవాళ రాజ్ భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ.. తెలంగాణ స్టేట్ బ్రాంచ్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకుగానూ అవార్డులను గవర్నర్ ప్రదానం చేశారు.

దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో కూడా 2024 నాటికి టీబీ నిర్మూలన జరగాలని గవర్నర్ తెలిపారు. తలసేమియా పేషంట్ల కోసం ఎన్నో వైద్య శిబిరాలను రెడ్ క్రాస్ ఏర్పాటు చేసిందని చెప్పారు. కరోనా సమయంలో తెలంగాణలోని మూడు జిల్లాల్లో గిరిజనుల కోసం పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. గిరిజనులకు న్యూట్రిషన్ ఫుడ్ అందించామని చెప్పారు.