ఉస్మానియా యూనివర్సిటీ మరిన్ని విజయాలు సాధించాలి

ఉస్మానియా యూనివర్సిటీ మరిన్ని విజయాలు సాధించాలి

దేశంలోని యూనివర్సిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంక్ సాధించడం పట్ల వీసీ రవీందర్ను గవర్నర్ తమిళసై అభినందించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ను ఓయూ వీసీ రవీందర్ సహా పలువురు ప్రోఫెసర్లు కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నత విద్యారంగంలో ముందంజలో ఉండడం సంతోషకరమన్నారు. ఓయూ పూర్వ విద్యార్థులు ఎన్నో రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. రానున్న కాలంలో యూనివర్సిటీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇతర యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీని ఆదర్శంగా తీసుకుని తమ పనితీరును మెరుగుపరుచుకుంటున్నాయని గవర్నర్ చెప్పారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఓయూను సందర్శించి అభినందించారని గుర్తుచేశారు. భవిష్యత్తులో మరింత ఉత్తమ ర్యాంక్ సాధించేలా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కాగా యూనివర్సిటీకి నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు గవర్నర్ సహా ప్రభుత్వానికి వీసీ కృతజ్ఞతలు తెలిపారు.