భారీ వర్షాలపై ఆరా తీసిన గవర్నర్ తమిళిసై

భారీ వర్షాలపై ఆరా తీసిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: గులాబ్‌ తుఫాను రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తుండడంతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. హైదరాబాద్ నగరంలో పలు కాలనీలు జలమయం కావడం.. ఇద్దరు యువకులు నాలాల్లో గల్లంతై చనిపోవయిన ఘటనల నేపధ్యంలో పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ఆమె స్వయంగా చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ కు ఫోన్ చేశారు. జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించడం.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించిన నేపధ్యంలో గవర్నర్ తమిళిసై విరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేయాలని... ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉంటే మేలని గవర్నర్ తమిళిసై సూచించారు.