బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం: గువ్వల బాల్ రాజు

బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం: గువ్వల బాల్ రాజు

అచ్చంపేట, వెలుగు: బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్  గువ్వల బాల్ రాజు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 300 మంది కుల వృత్తిదారులకు ఆర్థికసాయం పంపిణీ చేశారు. 

ALSO READ : Good Health : శాఖాహార కబాబ్స్.. ఎక్కువ ప్రొటీన్స్ తో మంచి ఆరోగ్యం

ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలను ఇతర పార్టీల నాయకులు చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. దళితబంధు మాదిరిగానే బీసీలకు రూ. లక్ష సాయం అందిస్తున్నట్లు చెప్పారు. మనోహర్, నరసింహా గౌడ్, అరుణ పాల్గొన్నారు.