రాజాసింగ్కు మరో బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్

రాజాసింగ్కు మరో బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. గతంలో ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో ఆయన పలుమార్లు  ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి, డీజీపీ దృష్టికి తెచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో ఇటీవలే పాత వాహనాన్ని ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టి వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. 2017 మోడల్ ఫార్చ్యూనర్ కారును రాజసింగ్‌ ఇంటికి పంపింది.

బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయింపుపై స్పందించిన రాజాసింగ్.. ధూల్ పేటలోని తన ఇంటికి పోలీసులు దాన్ని తీసుకొచ్చి పెట్టి వెళ్లారని అన్నారు. శ్రీశైలం ఉన్న ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత వెహికిల్ కండీషన్ ఎలా ఉందో చూసి చెబుతానన్నారు. తనకు కొత్త కారు మాత్రమే ఇవ్వాలని ఏం లేదని, కండీషన్ లో ఉన్న వెహికిల్ ఏదైనా పరవాలేదని చెప్పారు.