
మాదాపూర్శిల్పారామంలో వీకెండ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం వీఎస్ఎం మూర్తి ద్విభాష్యం శిష్య బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, సకల దేవత కీర్తనలను ఆలపించి సంగీత ప్రియులను అలరించారు. అనంతరం కుమారి సునయన తన భరతనాట్య ప్రదర్శనతో మెప్పించారు.