కాకినాడలో ​ జీపీజెడ్ ఏర్పాటు

కాకినాడలో ​ జీపీజెడ్ ఏర్పాటు

హైదరాబాద్​ : ఆంధ్ర ప్రదేశ్​లోని కాకినాడ వద్ద ఇంటిగ్రేటెడ్​ ఫార్మాస్యూటికల్​ జోన్స్​ (జీపీజెడ్​) ఏర్పాటుకు గ్రీన్​కో గ్రూప్​తో గ్రాన్యూల్స్​ ఇండియా చేతులు కలిపింది. 100 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2 వేల కోట్లతో అయిదేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. కెమికల్స్​ను ఎక్కువగా వాడే ఫార్మా ఇండస్ట్రీ నుంచి కార్బన్​ ఎమిషన్స్​ కూడా ఎక్కువగానే వెలువడతాయి. ఈ నేపథ్యంలో గ్రీన్​ మాలిక్యూల్​ సొల్యూషన్స్​ కోసం రెండు కంపెనీలు జతకట్టాయి. కొత్తగా పెట్టే ఫెసిలిటీలో కీ స్టార్టింగ్​ మెటీరియల్స్​ (కేఎస్​ఎం), ఇంటర్మీడియెట్స్​, ఏపీఐ (యాక్టివ్​ ఫార్మా ఇన్​గ్రీడియెంట్స్​) లు తయారవుతాయని, వాటితోపాటు ఫెర్మెంటేషన్​ బేస్డ్​ ప్రొడక్టులూ ఉంటాయని గ్రాన్యూల్స్​ ఇండియా వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్​కో సబ్సిడరీ కంపెనీ గ్రీన్​కో జీరో సీ కార్బన్​ ఫ్రీ ఎనర్జీని సప్లయ్​ చేస్తుందని పేర్కొంది. గ్రీన్​హైడ్రోజన్​, దాని డెరివేటివ్స్​నూ గ్రీన్​కో అందించనుందని వివరించింది. మెట్​ఫార్మిన్​లో వాడే  డైసయానమైడ్, పారాసిట్మాల్​ తయారీలో వాడే పారా అమినో ఫెనాల్​ వంటి గ్రీన్​హైడ్రోజన్​ డెరివేటివ్స్​ను గ్రీన్​కో సరఫరా చేస్తుందని పేర్కొంది. కార్బన్​ ఫుట్​ప్రింట్​ తగ్గించడంలో గ్రీన్​కోతో భాగస్వామ్యం సాయపడుతుందని గ్రాన్యూల్స్​ ఛైర్మన్​ సీ కృష్ణప్రసాద్​ చెప్పారు.