
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ను నిర్వహించింది. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇది నా కెరీర్లో మోస్ట్ మెమొరబుల్ మూవీ. చూసిన ప్రతి ఒక్కరికీ మంచి ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు. మనోజ్ మాట్లాడుతూ ‘తొమ్మిదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చినా నన్ను ఎంతో గొప్పగా ఆదరించారు.
నేను చేసిన గజపతి క్యారెక్టర్కి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది’ అని అన్నాడు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశానని అంతా చెప్పడం హ్యాపీగా ఉందని నారా రోహిత్ చెప్పాడు. ముగ్గురు హీరోలకి ఇది అద్భుతమైన కమ్ బ్యాక్ అని ఆడియెన్స్ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించిందని డైరెక్టర్ విజయ్ కనకమేడల అన్నాడు. హీరోయిన్ అదితి శంకర్, నిర్మాత రాధా మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు.