
ఒక దేశానికి ఏడు శాతం పరిమితి తొలగింపుపై ఒక అడుగు ముందుకు
‘హెచ్ఆర్ 1044’కు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం
త్వరలో సెనేట్కు.. ఆ తర్వాత ట్రంప్ సంతకం
3 లక్షల మంది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్కు ప్రయోజనం
ఫ్యామిలీ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసాల పరిమితి కూడా పెంపు
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్కు గుడ్ న్యూస్. గ్రీన్కార్డ్కు సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. గ్రీన్కార్డ్ అప్లికేషన్లపై ఒక దేశానికి ఇప్పటి వరకూ ఉన్న 7 శాతం పరిమితిని ఎత్తేసే బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ‘ఫెయిర్నెస్ ఫర్ హైస్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్ ఆఫ్ 2019’లేదా ‘హెచ్ఆర్ 1044’బిల్లును బుధవారం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ ఆమోదించింది. మొత్తం 435 మంది సభ్యులు ఉన్న సభలో 365–65 ఓట్ల తేడాతో బిల్లు పాసయ్యింది. దీంతో అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్స్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇండియా, చైనా లాంటి దేశాల ఐటీ ప్రొఫెషనల్స్కు లైన్ క్లియర్ కానుంది. అయితే ఈ బిల్లుకు సెనెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాత బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం పెడితే చట్టంగా మారుంది. ఇది చట్టంగా మారితే ఫ్యామిలీ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసాల్లో ఒక దేశానికి ఉన్న 7 శాతం కోటా ఆ సంవత్సరం అందుబాటులో ఉన్న గ్రీన్ కార్డుల్లో 15 శాతానికి పెరగనుంది. అలాగే ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసాల కోటాలో 7 శాతం పరిమితి తొలగనుంది.
ఎవరికి లాభం..?
గ్రీన్ కార్డు ద్వారా నాన్ అమెరికా సిటిజన్.. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పర్మినెంట్గా పనిచేసుకోవచ్చు. ఇండియన్హైస్కిల్డ్ ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువ మంది హెచ్1బీ వర్క్ వీసాలపై అమెరికా వెళ్లి అక్కడ పని చేస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఇమ్మిగ్రేషన్ సిస్టమ్తో పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు ఎన్నో పాట్లు పడుతున్నారు. ఒక దేశానికి 7 శాతం పరిమితి కారణంగా గ్రీన్కార్డుల కోసం వారంతా ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుత సిస్టం ప్రకారం హెచ్1బీ వీసాలపై పనిచేస్తున్న ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ గ్రీన్కార్డ్పొందాలంటే కనీసం 70 ఏళ్లు పడుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. తాజా బిల్లు చట్టంగా మారితే ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ కు సంబంధించి ఇప్పటి వరకూ ఒక దేశానికి ఉన్న సంఖ్యా పరిమితి తొలగిపోతుంది. అదే సమయంలో ఫ్యామిలీ స్పాన్సర్డ్ ఇమ్మిగ్రెంట్ లిమిటేషన్ ఒక దేశానికి సంబంధించి పరిమితి పెరగనుంది. ఇలాంటి బిల్లునే భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారీస్ మరికొందరితో కలిసిసెనెట్లో ప్రవేశపెట్టారు. ఇది కూడా త్వరలోనే సెనెట్ ముందుకు రానుంది.
మా ప్రయత్నాలు ఫలించాయి: సునయన
అమెరికాలో విద్వేషపూరిత హత్యకు గురైన తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కుచిబొట్ల భార్య సునయన ఈ బిల్లు కోసం పోరాటం చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడం తమ జీవితంలో కీలకమైన రోజని, ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసం తాము ఎదురుచూస్తున్నామని, తమ ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయని ఆమె చెప్పారు. 2017 ఫ్రిబవరిలో కాన్సస్ సిటీలో జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ హత్యతో తను ఇమ్మిగ్రేషన్కు సంబంధించి ఎన్నో కష్టాలు పడ్డానని, దేశంలో ఉండే హక్కును కోల్పోయానని ఆమె చెప్పారు. ఈ రోజు బిల్లు పాసవ్వడంతో తనకు ప్రశాంతత దొరికిందని, తన సంతోషాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని సునయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.