
హైదరాబాద్, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 28 గ్రీన్ యూనివర్సిటీ–2023 అవార్డుకు ఎంపికైంది. వర్సిటీలో పార్కుల ఏర్పాటు, భారీగా చెట్లు పెంచడంతో గ్రీన్ యూనివర్సిటీ అవార్డుకు ఆర్జీయూకేటీని అవార్డుల జ్యూరీ కమిటీ ఎంపిక చేసింది.
ఈ విషయాన్ని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్1న దుబాయ్లోని ఎక్స్ పో సిటీలో ఈ అవార్డును అందించనున్నారని పేర్కొన్నారు. ఇటీవలే కాప్28 నుంచి ఆహ్వానం అందిందని ఆయన చెప్పారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన వర్సిటీ సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు.