
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో 1950 హెల్ప్లైన్ తో నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఓటర్ల జాబితా, పోలింగ్ సెంటర్లు, ఎపిక్ కార్డులు, మోడల్ కోడ్ ఉల్లంఘనలు, ప్రలోభాల అంశాలు తదితర వాటికి సంబంధించిన సమాచారంతో ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చు. ఈ హెల్ప్లైన్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి 433 కాల్స్ రాగా, ఇందులో 379 కాల్స్ కు సమాధానం ఇచ్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.