గ్రూప్​ 2, 3 పరీక్షల సిలబస్​ ఒకటే

గ్రూప్​ 2, 3 పరీక్షల సిలబస్​  ఒకటే

రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్​ 2, 3 నోటిఫికేషన్లను టీఎస్​పీఎస్సీ ఇటీవలే విడుదల చేసింది. లక్షల్లో అభ్యర్థులు అప్లై చేసుకోనుండడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ రెండు పరీక్షల్లో సిలబస్​ దాదాపు ఒకేలా ఉంటుంది. కామన్​ ప్రిపరేషన్​తో రెండు ఉద్యోగాల్లో సక్సెస్​ ఎలా సాధించాలో తెలుసుకుందాం..

గ్రూప్–2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్​కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు ఎగ్జామ్​ ఉంటుంది. గ్రూప్ 3 లో మూడు పేపర్లు ఉండగా, ప్రతి పేపర్​కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్​ అబ్జర్వ్​ చేస్తే టీఎస్​పీఎస్సీలో గ్రూప్​ 2,​ 3 పరీక్షలో 60శాతం మార్కులు సాధిస్తే కొలువు సాధించవచ్చు. సిలబస్​లో ఉన్న అంశాలపై ఫోకస్​ చేస్తూ సబ్జెక్టుపై పట్టు సాధిస్తే కొలువు సులువుగా కొట్టవచ్చు.

పేపర్​ 1 (జనరల్​ స్టడీస్​, జనరల్​ ఎబిలిటీస్​)

సిలబస్​ ప్రకారం ఇందులో మొత్తం 11 అంశాలు ఉంటాయి.​ విస్తృతమైన సిలబస్​ ఉండడంతో ప్రిపరేషన్​కు ఎక్కువ సమయం పడుతుంది. 11 అంశాల్లో కేవలం సబ్జెక్టు పేరు మాత్రమే ఇచ్చి, చాప్టర్ల గురించి కాని వెయిటేజి గురించి కాని ఇవ్వలేదు. కాబట్టి ముందు మిగతా పేపర్లు చదివిన తర్వాతే, పేపర్​ 1 ప్రిపరేషన్​ కొనసాగించాలి. 

గ్రూప్​ 2,​ 3 రెండు ఎగ్జామ్స్​లోనూ పేపర్​ 1సిలబస్​లో సేమ్​ టాపిక్స్​ ఉంటాయి.  ప్రిపరేషన్​లో ముఖ్యంగా ఇంగ్లీష్​ , అర్థమెటిక్​ అండ్​ రీజనింగ్, డేటా ఇంటర్​ ప్రిటేషన్​ పై ఎక్కువ ఫోకస్​ చేయాలి​. నాన్​ మ్యాథ్స్​ అభ్యర్థులు ఎక్కువగా పేపర్​1లో మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్​, మెంటల్​ ఎబిలిటి నుంచి సుమారు 40 నుంచి 50 మార్కుల మధ్య వచ్చే అవకాశం ఉంది. వీటి మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడితే మొదటి పేపర్​లో మంచి మార్కులు సాధించవచ్చు. 

తెలంగాణ రాష్ట్ర పాలసీలు తెలంగాణ ఎకానమీలో భాగంగా కవర్​ అవుతాయి. సోషల్​ ఎక్స్​క్లూజన్​, రైట్​ ఇష్యూస్​ మరియు ఇన్​క్లూజన్​ పాలసీలు పాలిటీలో భాగంగా ఉంటాయి. ‌‌‌‌ తెలంగాణ సొసైటీ, కల్చర్​, హెరిటేజ్​, కళలు, సాహిత్యానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందినవి రెండో పేపర్​లో పూర్తిగా కవర్​ అవుతాయి. ఇండియా హిస్టరీ అండ్​ కల్చరల్​ హెరిటేజ్​ సిలబస్​ దాదాపు పేపర్​ 1తో పాటు పేపర్​ 2లో భాగంగా ఉంటాయి. అంతర్జాతీయ కరెంట్​ అఫైర్స్​, సంబంధాలు, సంఘటనలు దాదాపు ఒక దానికొకటి అనుసంధానంగా ఉంటాయి. వరల్డ్​ జాగ్రఫీకి సమకాలీన అంశాలు చదివితే సరిపోతుంది. ఇండియన్​ జాగ్రఫీకి సంబంధించి అట్లాస్​పై ఫోకస్​ చేయాలి. తెలంగాణ జాగ్రఫీ దాదాపు మూడో పేపర్​లో భాగంగా కవర్​ అవుతుంది. 

పేపర్​ 2 (చరిత్ర, పాలిటీ, సమాజం)

పేపర్​2 లో హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో పేపర్​ 2 సిలబస్​ గ్రూప్​ 2 ,3 రెండింటికి ఒకటే ఉద్యమం ఒక్కటే గ్రూప్​2 లో 150 మార్కులకు ఉంటుంది. కాని గ్రూప్​ 3లో 30 నుంచి 40 మార్కులు రావడానికి అవకాశం ఉంది.  ఈ పేపర్​ కోసం గ్రాడ్యుయేషన్​ స్థాయిలో చదవాలి, కాని జనరల్​ స్టడీస్​లో భాగంగా చదవకూడదు. 

పేపర్​ 3 ( ఇండియా, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి)

ఈ పేపర్​లో మొత్తం మూడు సబ్జెక్టులుగా ఇండియా, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అనే అంశాలను ఇచ్చారు. కొత్తగా ఇందులో జనాభా, బడ్జెట్​, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను చేర్చారు.  గ్రూప్​2, 3లో రెండింటిలో సిలబస్​ పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది. సిలబస్​ లిమిటెడ్​గా ఉండి, మార్కెట్​లో పుస్తకాలు కూడా పరిమితంగా దొరకడంతో ప్రిపరేషన్​ సమయం వృథా కాకుండా ఎక్కువ మార్కులు సాధించే చాన్స్​ ఈ పేపర్​లో ఉంది. 

పేపర్​ 4 ( తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర ఆవిర్భావం)

గ్రూప్​ 2లో ఒక పేపర్​గా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. గ్రూప్​ 3లో రెండో పేపర్​లో  భాగంగా ఇస్తారు. గ్రూప్​ 2 కు ఇచ్చిన ఉద్యమ చరిత్ర మీద ఫోకస్​ చేస్తూ ప్రిపేర్​ అయితే గ్రూప్​ 3లో సులభంగా మార్కులు సాధించవచ్చు. 

గ్రూప్‌‌-2 లక్షణాలు: గ్రూప్​2 ఆబ్జెక్టివ్‌‌ పరీక్ష విధానం కాబట్టి సాధారణంగా చాలామంది అభ్యర్థులు ఉత్సాహం చూపుతారు. గ్రూప్‌‌-2ని పకడ్బందీగా చదివితే గ్రూప్‌‌-3, ఇతర పరీక్షల్లో జనరల్‌‌ స్టడీస్‌‌ విభాగాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. అవసరమైతే బట్టీ పట్టయినా సమాచారాన్ని గుర్తుంచుకోవాలి. ఎకానమీలో విస్తృతమైన గణాంకాలు, భారతదేశ, తెలంగాణ చరిత్రల్లో, తెలంగాణ ఉద్యమంలో క్రోనాలజీ, రాజ్యాంగంలో ఆర్టికల్స్, కోర్టు కేసులపై పట్టు, విశ్లేషణ సామర్థ్యాలు అవసరం. గ్రూప్‌‌-3 లక్షణాలు: సిలబస్ సేమ్​ ఉండడంతో గ్రూప్‌‌-2 గట్టిగా ప్రిపేరయితే గ్రూప్‌‌-3 సులభంగానే సాధించవచ్చు. గ్రూప్‌‌-2లో పేర్కొన్న లక్షణాలన్నీ గ్రూప్‌‌-3 అభ్యర్థులకు కూడా ఉండాలి. గ్రూప్​ 3 మాత్రమే ప్రిపేర్​ అయ్యే అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే.. సిలబస్‌‌లోని అంశాలపై ప్రాథమిక అవగాహన, ఫ్యాక్ట్‌‌ ఆధారిత ప్రశ్నలు, సమాచారంపై ఆధారపడిన ప్రిపరేషన్‌‌. గ్రూప్‌‌-2 అభ్యర్థులతో పోటీపడేందుకు విశ్లేషణాత్మక, అన్వయాత్మక ప్రశ్నలకు కూడా తయారయ్యేలా సమయం కేటాయించుకొని ప్లాన్​ అమలు చేయాలి.

సొంత నోట్స్​ బెస్ట్​

ప్రిపరేషన్​ సమయంలో పలు పేపర్లలో ఉమ్మడిగా ఉన్న అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదువుతూ నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్​ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. జనరల్ స్టడీస్​, కరెంట్​ అఫైర్స్​, అంతర్జాతీయ అంశాలు, రాజ్యాంగం, ఎకానమీ, అభివృద్ధి టాపిక్స్​ లింక్​ చేసుకుంటూ సమకాలీన అంశాలు జోడించుకుంటూ చదవాలి. అభ్యర్థులు ముందుగా సిలబస్​ మీద స్పష్టత తెచ్చుకొని ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు అంబేద్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ బుక్స్​కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్​ 2, 3 పరీక్షలు ఆబ్జెక్టివ్​ విధానంలో ఉన్నా, డిస్​క్రిప్టివ్​ విధానంలో చదివితే ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ప్రశ్న ఎలా అడిగినా సమాధానం గుర్తించవచ్చు. 

పృథ్వీ కుమార్​ చౌహాన్​
పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​