- టీశాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: టీశాట్లో గ్రూప్ 1, 2, 3 అభ్యర్థులకు క్రాష్ కోర్సు అందిస్తామని టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఓరియెంటేషన్ లైవ్ క్లాసులను కూడా ప్రసారం చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం నుంచి ఈ క్రాష్ కోర్సు మొదలై ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతుందని చెప్పారు. శనివారం ఉదయం నిపుణ చానల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బయాలజీ సబ్జెక్ట్పై క్లాసులు ప్రసారం చేస్తామని తెలిపారు.
మరుసటి రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు టీశాట్ విద్య చానల్లో ఇదే క్లాసులను పున:ప్రసారం చేస్తామని చెప్పారు. క్రాష్ కోర్స్ ప్రసారాలు టీశాట్ నెట్వర్క్ చానళ్లు నిపుణ, విద్యతో పాటు యాప్, యూట్యూట్లలో కూడా ప్రసారమవుతాయన్నారు. మరిన్ని వివరాలకు 040 23540326, 040 23540726 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4039 నంబర్లకు ఫోన్ చేయొచ్చని తెలిపారు.