- రూ. 10 వేల నుంచి రూ. కోటి దాకా క్యాష్ ప్రైజు
న్యూఢిల్లీ: మేరా బిల్ మేరా అధికార్ పేరిట జీఎస్టీ ఇన్వాయిస్ ఇన్సెంటివ్ స్కీమును సెప్టెంబర్ 1 నుంచి ఆరు రాష్ట్రాలలో ప్రభుత్వం అమలులోకి తేనుంది. ఈ స్కీము కింద రూ. 10 వేల నుంచి రూ. కోటి దాకా నగదు ప్రైజ్గా గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా కొన్న ప్రతిసారీ బిల్లు అడిగేలా అలవాటును పెంపొందించే దిశలో ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంటోంది. అసోం, గుజరాత్, హర్యానా, పుదుచ్చేరి, దామన్ అండ్ డయ్యు, దాద్రా అండ్ నగర్ హవేలిలలో మొదటగా ఈ స్కీమును అమలులోకి తెస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ప్రకటించింది. జీఎస్టీ ఇన్వాయిస్లను అప్లోడ్ చేయడం ద్వారా క్యాష్ ప్రైజులు గెలుచుకోవడానికి ఇన్వాయిస్ ఇన్సెంటివ్ స్కీము వీలు కల్పిస్తుందని పేర్కొంది. జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయర్లు ఇచ్చే జీఎస్టీ ఇన్వాయిస్లు అన్నీ ఈ స్కీము కింద అర్హమైనవేనని, మంత్లీ, క్వార్టర్లీ డ్రా ఉంటాయని వివరించింది. మేరా బిల్ మేరా అధికార్ స్కీములో భాగం పంచుకోవడానికి కనీసం రూ. 200 విలువైన కొనుగోళ్లను చేయాల్సి ఉంటుంది. నెలకి గరిష్టంగా 25 ఇన్వాయిస్లను ఒక్కో కన్జూమర్ అప్లోడ్ చేయొచ్చు.