గుజరాత్, యూపీలే శ్రీలంకలా మారాయి

గుజరాత్, యూపీలే శ్రీలంకలా మారాయి

తెలంగాణను శ్రీలంకతో పోలుస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ పాలిస్తున్న గుజరాత్, యూపీ రాష్ట్రాలే శ్రీలంకలా మారాయని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. ఆకలి సూచీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాతి స్థానంలో భారత్ ఉందంటే.. దానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. బీజేపీ పాలనలో భారత్ సోమాలియాగా మారినా ఆశ్చర్యం లేదన్నారు.

నిన్నమొన్నటి వరకు మెచ్చుకొని..

తెలంగాణ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను నిన్నమొన్నటి వరకు మెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఓట్ల రాజకీయం కోసం తెలంగాణపై కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి బీజేపీని గద్దె దింపుతేనే.. దేశ ప్రజల ఆకలి తీరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘టార్గెట్ తెలంగాణ’ పేరుతో ప్రధాని మోడీ సమావేశాలపై మంత్రి ఈమేరకు ఘాటుగా స్పందించారు. తెలంగాణలో పార్టీని విస్తరించే ఏకైక లక్ష్యంతో ఆకలి దప్పుల విషయాలను పక్కదారి పట్టించి.. గుడులు, మసీదుల పంచాయతీని బీజేపీ పెడుతోందన్నారు. బీజేపీ లాంటి ఫాసిస్టు శక్తులను ఎలా అడ్డుకోవాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. చైతన్యవంతమైన తెలంగాణాలో బీజేపీ ఆటలు సాగవని తెలిపారు.

మరిన్ని వార్తలు..

దీపావళికి ఐదు భాషల్లో 'హర హర మహాదేవ్' ..

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్