నాకథ వాడితే అస్సలు ఊరుకోను.. గుణశేఖర్ మాస్ వార్నింగ్

నాకథ వాడితే అస్సలు ఊరుకోను.. గుణశేఖర్ మాస్ వార్నింగ్

టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ సినిమాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు గుణశేఖర్(Gunashekhar). అయన తీసిన సినిమాలు ఆ రేంజ్ లో ఉండేవి మరి. బాలా రామాయణం(Bala Ramayanam), చూడాలని ఉంది(Chudalani undi), ఒక్కడు(Okkadu) వంటి సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. ఆ తరువాత మాత్రం ఆయన పరిస్థితి పూర్తిగా మారిపోయిది. వరుసగా భారీ ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకొని.. గుణశేఖర్ తో సినిమా అంటేనే నిర్మాతలు భయపడే రేంజ్ కు వచ్చారు. 

ఇక చాలా కాలం తరువాత అనుష్క(Anushka)తో తెరకెక్కించిన రుద్రమదేవి(Rudramadevi) సినిమాతో మల్లి సక్సెస్ ట్రాక్ ఎక్కారు గుణశేఖర్. ఈ సినిమా తరువాత రానా(Rana)తో హిరణ్యకశ్యప(Hiranyakashyapa) అనే సినిమా చేయాలని ప్లాన్ చేశారు ఈ దర్శకుడు. కానీ కొన్ని అనుకోని కారణాల ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో.. సమంత(Samantha)తో శాకుంతలం(Shakunthalam) సినీమా చేశారు గుణశేఖర్. కానీ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో మల్లి కష్టాల్లో పడిపోయారు గుణశేఖర్.

ఇదిలా ఉండగా రీసెంట్ గా హీరో రానా తన తదుపరి సినిమాగా హిరణ్యకశ్యపను అధికారికంగా ప్రకటించారు. కానీ డైరెక్టర్ గా గుణశేఖర్ పేరు  వినిపించలేదు. తన కథతో రానా వేరే దర్శకుడితో సినిమా చేయడంపై స్పందించారు గుణశేఖర్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నేను ఒక హీరోకి సినిమా కథ చెప్పాను. ఓకే కూడా అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ హీరో ప్రాజెక్టు నుండి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడొచ్చి మల్లి అదే కథతో తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సినిమా కథ నా కథ ఒకటే అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. దేనికైనా సిద్ధం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం గుణశేఖర్ కు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.