రేపు గుంటూరు–వరంగల్ స్పెషల్ ట్రైన్

రేపు గుంటూరు–వరంగల్  స్పెషల్ ట్రైన్

సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే గుంటూరు- – వరంగల్​ మధ్య వన్​వే లో స్పెషల్ ట్రైన్(నం. 07016) నడుపుతుంది. బుధవారం ఉదయం 6.40 గంటలకు గుంటూరులో బయలుదేరి  మధ్యాహ్నం 12.30గంటలకు వరంగల్ చేరుకుంటుంది.

విజయవాడ, మధిర, మోటుమర్రి, బోనకల్, చింతకాని, ఖమ్మం, పాపట్​పల్లి, డోర్నకల్, మహబూబాబాద్​, కే సముద్రం, నెక్కొండ, చింతపల్లి స్టేషన్లలో హాల్టింగ్​ ఉంటుందని రైల్వేఅధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.