సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే గుంటూరు- – వరంగల్ మధ్య వన్వే లో స్పెషల్ ట్రైన్(నం. 07016) నడుపుతుంది. బుధవారం ఉదయం 6.40 గంటలకు గుంటూరులో బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు వరంగల్ చేరుకుంటుంది.
విజయవాడ, మధిర, మోటుమర్రి, బోనకల్, చింతకాని, ఖమ్మం, పాపట్పల్లి, డోర్నకల్, మహబూబాబాద్, కే సముద్రం, నెక్కొండ, చింతపల్లి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని రైల్వేఅధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.