RTC బస్సులపై గుట్కా యాడ్స్ తీసేయాల్సిందే

RTC బస్సులపై గుట్కా యాడ్స్ తీసేయాల్సిందే

RTC బస్సుల పై గుట్కా ప్రకటనలు ఉండటాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుపట్టారు.  గుట్కా నిషేధం అంటూనే రాష్ట్ర ప్రభుత్వం గుట్కాలకు పబ్లిసిటి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తింటే హానికరమని తెలిసి కూడా పాన్ మసాలాకు సంబంధించి బస్సు వెనుక ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది తింటే క్యాన్సర్ వస్తుందని రాసి ఉన్నా..కొద్ది డబ్బు కోసం ప్రభుత్వం,ఇలాంటి ప్రకటనలు  చేయడం తప్పు కదా అని అన్నారు.

ఇలాంటి హానికరమైన  ప్రకటనలు మానుకోవాలని సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ ను కోరుతున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్. మన యువతను నాశనం చేసే గుట్కాలకు ప్రభుత్వం ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. గుట్కా లు నిషేధం ఉన్న రాష్ట్రంలో అమ్మకాలు జరుగుతున్నాయన్న రాజాసింగ్ …గుట్కాలు తినొద్దంటూ యూత్ కు విజ్ఞప్తి చేశారు. గుట్కాలు అమ్మే వాళ్ళ పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.