ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీ ఫైనల్లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌

ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీ ఫైనల్లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌

సిడ్నీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్ హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 21–18, 21–12తో ఇండియాకే చెందిన ప్రియాన్షు రజావత్‌‌‌‌‌‌‌‌పై గెలిచాడు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌కు ఇది రెండో ఫైనల్‌‌‌‌‌‌‌‌ కావడం గమనార్హం. 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో ప్రియాన్షు పైచేయి సాధిస్తే, తర్వాత ప్రణయ్‌‌‌‌‌‌‌‌ క్రమంగా ఆధిక్యంలోకి వచ్చాడు. 

రెండు గేమ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ప్రణయ్‌‌‌‌‌‌‌‌ జంప్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌, పదునైన స్మాష్‌‌‌‌‌‌‌‌లు, సుదీర్ఘమైన ర్యాలీలతో అదరగొట్టాడు. 0–2తో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టిన ప్రియాన్షు.. ప్రణయ్‌‌‌‌‌‌‌‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఓ దశలో 18–18తో స్కోరు సమం చేశాడు. కానీ ప్రణయ్‌‌‌‌‌‌‌‌ కొట్టిన క్రాస్‌‌‌‌‌‌‌‌ ర్యాలీలను తీయలేకపోయాడు. ఇక రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌ పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌.. వెంగ్‌‌‌‌‌‌‌‌ హాంగ్‌‌‌‌‌‌‌‌ యాంగ్‌‌‌‌‌‌‌‌ (చైనా)తో తలపడతాడు. రెండో సెమీస్‌‌‌‌‌‌‌‌లో యాంగ్‌‌‌‌‌‌‌‌ 21–19, 13–21, 21–13తో లీ జి జియా (మలేసియా)ని ఓడించాడు.