- వార్బర్గ్ పింకస్తో కలిసి 49 శాతం వాటా కొనుగోలు
- డీల్ విలువ రూ.17,995 కోట్లు
న్యూఢిల్లీ: భారతీ ఎంటర్ప్రైజెస్, వార్బర్గ్ పింకస్ సంస్థలు సంయుక్తంగా చైనా కన్జూమర్ అప్లయెన్సెస్ కంపెనీ హాయర్ ఇండియాలో 49 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఈ డీల్ విలువ రూ.17,955.5 కోట్లు హాయర్ గ్రూప్నకు మిగిలిన 49 శాతం వాటా ఉంటుంది. మిగతా వాటా మేనేజ్మెంట్ టీమ్ వద్ద ఉంటుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భారత్లో తయారీ సామర్థ్యం పెంచి మార్కెట్ విస్తరణ చేపట్టనున్నారు.
2025 నాటికి రూ.11 వేల కోట్ల ఆదాయం సాధించాలని హాయర్ లక్ష్యంగా పెట్టుకుంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల రంగంలో మార్కెట్ వాటా పెంచుకోవాలని చూస్తోంది. జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన టీవీ అమ్మకాలు సంస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయి.
భారతీ ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్, వార్బర్గ్ పింకస్ పెట్టుబడుల అనుభవం త వృద్ధికి తోడ్పడతాయని హాయర్ భావిస్తోంది. 'మేడ్ ఇన్ ఇండియా' విజన్ కింద స్థానికంగా వనరుల సేకరణ, తయారీ సామర్థ్యాన్ని ఈ సంస్థలు పెంచనున్నాయి.
