
- ఎంట్రీ ఫీజు రూ.300, షాంపూ, ఆయిల్కు రూ.700 వసూలు
- నిర్వాహకుడు సూర్యాపేటకు చెందిన హరీశ్గా గుర్తింపు
ఉప్పల్, వెలుగు: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ సిటీలో మరో శిబిరం వెలిసింది. ఢిల్లీకి చెందిన సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నామంటూ శిబిరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో జనం ఎగబడ్డారు. జుట్టు వస్తుందనే ఆశతో వందల మంది క్యూకట్టారు. సూర్యాపేట జిల్లా రాజానాయక్తండాకు చెందిన హరీశ్అనే వ్యక్తి బుధవారం ఉప్పల్ భగాయత్ లో ‘బట్టతలకు మందు’ అంటూ క్యాంప్ఏర్పాటు చేశాడు. ఎంట్రీ ఫీజును రూ.300గా, బట్టతలకు షాంపూ, ఆయిల్కింద రూ.700గా పెట్టాడు. స్థానికులతోపాటు, సిటీలోని పలు ప్రాంతాలకు చెందిన వందల మంది క్యాంప్వద్ద క్యూ కట్టారు. ఒక్కొక్కరు వెయ్యి రూపాయిలు చెల్లించి ట్రీట్మెంట్చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.
వినోద్, రాజశేఖర్అనే మరో ఇద్దరితో కలిసి శిబిరానికి వచ్చిన కస్టమర్లకు హరీశ్గుండు కొట్టి ఆయిల్రాశాడు. తర్వాత తాను ఇచ్చిన షాంపూ, ఆయిల్వాడాలని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్పోలీసులు అక్కడి చేరుకుని అందరినీ వెళ్లగొట్టారు. శిబిరానికి లీగల్గా ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. హరీశ్, వినోద్, రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే డబ్బులు చెల్లించిన బట్టతల బాధితులు లబోదిబోమన్నారు. తాము చెల్లించిన పైసలు ఇప్పించాలని కోరారు. పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్నిరోజుల కింద ఇలాగే ఓల్డ్సిటీలో బట్టతలపై జుట్టు మొలిపిస్తామని ఓ సెలూన్నిర్వాహకుడు హల్చల్చేశాడు.