- నేడు హ్యాండ్బాల్ లీగ్ సెమీస్
- రా. 7.30 నుంచి జియో సినిమా, స్పోర్ట్స్18లో లైవ్
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్ క్లైమాక్స్కు వచ్చేసింది. లీగ్ దశలో అదరగొట్టిన టాప్4 జట్లు సెమీఫైనల్ ఫైట్కు రెడీ అయ్యాయి. శనివారం జరిగే సెమీస్లో తెలుగు టాలన్స్ జట్టు.. గోల్డెన్ ఈగల్స్ యూపీ మెన్ టీమ్తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో పది మ్యాచ్ల్లో ఏడింటిలో గెలిచిన టాలన్స్ 15 పాయింట్లు సాధించి రెండో ప్లేస్లో నిలిచింది. యూపీ టీమ్ ఆరు గెలిచి నాలుగో స్థానంతో సెమీస్కు వచ్చింది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న టాలన్స్ లీగ్ దశ జోరును కొనసాగిస్తే ఫైనల్కు చేరుకోవడం పెద్ద కష్టమేం కాబోదు. మరో సెమీస్లో టేబుల్ టాపర్ మహారాష్ట్ర ఐరన్మెన్.. మూడో ప్లేస్లో రాజస్తాన్ తో తలపడనుంది. ఆదివారం ఫైనల్ జరగనుంది.