దివ్యాంగులకు స్పెషల్ స్కూల్

దివ్యాంగులకు స్పెషల్ స్కూల్

మహబూబ్ నగర్, వెలుగు : జిల్లాలోని మూగ, చెవిటి దివ్యాంగులకు ప్రత్యేక స్కూల్​ను ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. బుధవారం తన చాంబర్లో మూగ, చెవిటి దివ్యాంగుల సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ల మొట్టమొదటిసారిగా మూగ, చెవిటి దివ్యాంగులకు సైన్డ్ లాంగ్వేజ్ ద్వారా స్కూల్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శిక్షణ ఇచ్చే టీచర్లు జిల్లాలో లేకుంటే హైదరాబాద్

నుంచి పిలిపిస్తామని హామీ ఇచ్చారు. స్కూల్​లో వీడియోల ద్వారా శిక్షణ ఇస్తామని అన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఇక్కడ చదువు నేర్చు కోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ క్రాంతి, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి శంకరాచారీ తదితరులు పాల్గొన్నా రు.