హైదరాబాద్: గ్రేటర్సైబరాబాద్ పరిధిలోని మణికొండలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. మణికొండ పరిధిలోని పుప్పాల గూడకు చెందిన శ్రేయ(20) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనస్థలంలో శ్రేయ రాసినట్లు గా భావిస్తున్న నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన బలవన్మరణానికి విద్యార్థులు, ఫ్యాకల్టీ కారణమని సూసైడ్ నోట్ లో రాయడం కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రేయ స్థానిక వాసవి ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది.అయితే గత కొంత కాలంగా ఫ్యాకల్టీ, విద్యార్థులను వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. ఎగ్జామ్ సమయంలో ఓ లెక్చరర్ అందరి ముందు తనను అవమానించడం, తోటి విద్యార్థులు టార్గెట్ చేసి వేధించడంతో మనస్తాపం చెందినట్లు శ్రేయ సూసైడ్ నోట్రాసిందని పోలీసులు చెబుతున్నారు.
సూసైడ్ నోట్తో పాటు ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పూ ర్తి విచారణ అనంతరం బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నార్సింగి పోలీసులు తెలిపారు.
