హైదరాబాద్, వెలుగు: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్పార్టీ ఎత్తగొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పార్లమెంటరీ పక్షనేత కె. కేశవరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఆపాలని అక్టోబర్23న మాణిక్రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని, ఆరోజే ఢిల్లీలో రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి ఈ విషయం చెప్పారన్నారు. రైతుబంధు ఆన్గోయింగ్ స్కీం అని సీఈసీని అనుమతి కోరితే పర్మిషన్ఇచ్చిందని, దాన్ని తాను స్వాగతించాను తప్ప ఎలక్షన్ కమిషన్పెట్టిన ఆంక్షలను ఎక్కడా అతిక్రమించలేదన్నారు. దానిపై పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఎలక్షన్ కమిషన్కు మళ్లీ కంప్లైంట్ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.
రైతుబంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చినప్పుడు ఎలక్షన్కమిషన్, బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్బంధమని రేవంత్ ఆరోపించారే తప్ప రైతులకు సాయం అందించే కార్యక్రమాన్ని స్వాగతించలేదని తెలిపారు. రైతులంటే రేవంత్కు ప్రేమ ఉంటే రైతుబంధు సాయం పంపిణీని స్వాగతించే వారని గుర్తు చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వేసే టైంలో ఫిర్యాదు చేసి రైతుల నోటికాడి బుక్కను కాంగ్రెస్ లాగేసిందన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. వంద ఎలుకల్ని తిన్న పిల్లి.. నేను శాకాహారి అన్నట్టుగా వారి తీరు ఉందన్నారు. కాంగ్రెస్‘చేతి’ని అడ్డం పెట్టి రైతుబంధును ఆపలేరన్నారు. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్అని.. ఆ పథకంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని అన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్పార్టీకి ఈనెల 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
పంట దెబ్బతింటే పైసా ఇవ్వలేదు
కాంగ్రెస్కు రైతులంటేనే గిట్టదని, అది ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయేనన్నారు. ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేసిందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీది రైతు వ్యతిరేక వైఖరేనని చెప్పారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చేవారని, కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేశారన్నారు. తెలంగాణలో గెలిచి రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. ఉత్తమ్ రైతుబంధును దుబారా అంటున్నారని, రేవంత్ రైతులను బిచ్చగాళ్లు అంటున్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంట్ఇచ్చి రైతులను అరిగోస పెట్టిందని, ఎరువులు, విత్తనాలను పోలీస్స్టేషన్ల ముందు లైన్లో నిలబెట్టి పంపిణీ చేస్తూ బాధ పెట్టిందన్నారు. ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులు అని పేరు పడిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో నీలం తుఫాను దాటికి ఆంధ్రా ప్రాంతంలో పంటలు దెబ్బతింటే సాయం ఇచ్చిన అప్పటి పాలకులు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పంటలు దెబ్బతింటే పైసా ఇవ్వలేదన్నారు. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలోని సీఎం చాంబర్ఎదుట తాము ఆందోళన చేస్తుంటే తమను తొక్కుకుంటూ పోయారే తప్ప సాయం ఇవ్వలేదన్నారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడి వారసుడు రేవంత్ అని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన మూడు గంటల కరెంట్చాలు అన్నారని, కర్నాటక డిప్యూటీ సీఎం ఐదు గంటల కరెంట్చాలు అంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే
కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేస్తామని అభ్యర్థులు బాండ్ పేపర్లు రాసి ఇస్తున్నారని.. అవి చిత్తు కాగితాలని హరీశ్రావు అన్నారు. కర్నాటకలో రాహుల్గాంధీ 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అటువైపే చూడటం లేదన్నారు. ‘‘రాహుల్కు పోవాల్సింది చిక్కడపల్లికి కాదు.. ఆయనకు దమ్ముంటే బెంగళూరుకు పోయి నిరుద్యోగులతో మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమాల గడ్డ.. ఇక్కడికి ఎవరొచ్చి మాట్లాడినా ప్రజలు నమ్మరు. కేసీఆర్మూడోసారి గెలిచి హ్యాట్రిక్కొడతారు. 80 సీట్లలో గెలుస్తం”అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనన్నారు.
కేంద్రం బోర్ల కాడ మీటర్లు పెట్టాలని చెప్తే కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని, కేసీఆర్ఒక్కరే మీటర్లు పెట్టేది లేదని తేల్చిచెప్పారన్నారు. రేపు కాంగ్రెస్గెలిస్తే మోటార్ల కాడ మీటర్లు పెడతారని హెచ్చరించారు. డిసెంబర్3న బీఆర్ఎస్గెలుస్తుందని, 6 న రైతుబంధు సాయం ఇస్తామన్నారు. రైతుల విషయంలో కాంగ్రెస్ది కపట నాటకమని, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే గానీ తెలుపు కాదు అనడానికి రైతుబంధు సాయం ఆపడమే పెద్ద ఉదాహరణ అన్నారు. రైతుబంధు సాయం విషయంలో తాను హరీశ్రావును తప్పుబట్టినట్టుగా వార్తలు ప్రసారం చేయడం తగదని ఎంపీ కె. కేశవరావు అన్నారు. రైతుబంధు సాయం పంపిణీని అనుమతిస్తూ ఈసీ ఇచ్చిన గైడ్లైన్స్ను హరీశ్అతిక్రమించలేదన్నారు. రాజకీయ పార్టీలు కొట్లాడుకోవాలే తప్ప రైతుల పొట్టకొట్టవద్దని కూడా తాను కోరానని తెలిపారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమ భరత్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.