అలా దుష్ప్రచారం చేస్తున్నవారిని చెప్పుతో కొడతా : హరీశ్ రావు

అలా దుష్ప్రచారం చేస్తున్నవారిని చెప్పుతో కొడతా :   హరీశ్ రావు

మాజీ మంత్రి,  బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.  తన మీద ఏక్ నాథ్ షిండే అంటూ ఆరోపణలు చేస్తున్న వారిపై ఆయన ఫైరయ్యారు.  తాను పార్టీ మారతానని దుష్ప్రచారం చేస్తున్నవారిని చెప్పుతో కొడతానని అన్నారు. తన పుట్టుక బీఆర్ఎస్,చావు  బీఆర్ఎస్ అని చాలా సార్లు చెప్పానని గుర్తుచేశారు. తనకు  క్యారెక్టర్ ముఖ్యమని..  విశ్వాసం, విశ్వసనీయత అనేది తనకు ప్రధానం అని చెప్పుకొచ్చారు. 

 పదవి కోసం పాకూలాడే వ్యక్తిని తాను కాదని...  24 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఓకే పార్టీ అని పూటకో పార్టీ మారే రకం తాను కాదన్నారు. పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వతానికి ప్రాధన్యం ఇస్తానని తెలిపారు.  వ్యక్తిత్వాన్ని చంపుకుని పదవి కోసం గడ్డి తినే వ్యక్తిని తాను  కాదన్నారు.  ఇదే విషయాన్ని తాను చాలా సార్లు చెప్పానని హరీశ్ రావు వెల్లడించారు.  ఇన్ని సార్లు చెప్పాక కూడా ఎవరైనా హరీశ్ రావు ఏక్ నాథ్ షిండేగా మారుతాడంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.  

ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నానని.. సీఎం  రేవంత్ అన్ని హామీలు నెరవేర్చి తమకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.