అందాల పోటీల పేరుతో రాష్ట్రం పరువు తీసిన్రు : హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

అందాల పోటీల పేరుతో రాష్ట్రం పరువు తీసిన్రు : హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు
  • సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

జగదేవపూర్, వెలుగు : ‘అందాల పోటీల పేరుతో రాష్ట్ర పరువు తీశారు, ఓ కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు అనుచితంగా ప్రవర్తించి దేశ, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బ తీశారు’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని తీగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో ఆదివారం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ  రూ.200 కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహించడం వల్ల ఎవరి కడుపు నిండిందని, రాష్ట్రానికి అణాపైసా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకుల కోసమే అందాల పోటీలు పెట్టారని విమర్శించారు. 

రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్టు వేసిన రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి... చివరకు మోసం చేశారని మండిపడ్డారు. ఆయనకు ప్రజలే తగ్గిన బుద్ధి చెబుతారన్నారు. మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, లోగోలో చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాకతీయ కళా తోరణం తీసేయడమేనా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటేనే కల్లబొల్లి మాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేయడమని ఎద్దేవా చేశారు. తులం బంగారం, రూ.4 వేల పించన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ. 15 వేల రైతు బంధు అని చెబితే నమ్మి ఓటేసిన వారిని నట్టేట ముంచారన్నారు.

రైతులకు కనీసం జనుము, జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇప్పుడు కాగితాలు పంచి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తల జేబులు నింపేందుకే రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యువశక్తి ప్రకటించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటేరు ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంద్రసేనారెడ్డి, గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదాసు శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు పాండు గౌడ్, బాలేశం గౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అంజిరెడ్డి, భూమయ్య యాదవ్ పాల్గొన్నారు.