యూపీలో విపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయి

యూపీలో విపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయి

లక్నో: హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై విపక్షాలు చేస్తున్న నిరసనల మీద ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నుతున్నాయని యోగి ఆరోపించారు. కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఇప్పటికీ కొందరు సమాజాన్ని కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన విభజించాలని యత్నిస్తున్నారు. వారికి అభివృద్ధి కనిపించడం లేదు. అందుకే వాళ్లు కొత్త కుట్రలను పన్నుతున్నారు. ఓ వ్యక్తి మృతిపై రాజకీయాలు చేస్తున్న వారిని అందరూ గుర్తించాలి’ అని యోగి పేర్కొన్నారు. హత్రాస్ బాధితురాలి కుటుంబీకులను యూపీలోని విపక్ష పార్టీలు కలిసిన నేపథ్యంలో యోగి పైవ్యాఖ్యలు చేశారు.