పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 22 మంది మృతి

పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 22 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ (Pakistan)లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి అబోటాబాద్‌కు వెళ్తున్న హజరా ఎక్స్‌ప్రెస్‌లో పది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ పాకిస్తాన్‌లోని నవాబ్‌షా ప్రాంతంలోని సర్హారీ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి. హైదరాబాద్‌, సక్రంద్‌ నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని నవాడ్‌షా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా సింధ్‌ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.